సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే తన అభిప్రాయాలను వ్యక్త పరచని ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఈయన కేవలం కమర్షియల్ పరంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఏ ఆర్ రెహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. సంగీత దిగ్గజానికి శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని తెలియజేస్తూ ఏ ఆర్ రెహమాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇక ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు వెల్లడించారు. ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు తాజాగా అందరి హీరోల గురించి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా సాధించిన విజయాన్ని మెచ్చుకుంటూ బన్నీ యూ ఆర్ రాక్ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఇకపోతే ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 1 2022న సమ్మర్ కానుకగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు అలాగే జీ.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ తో కలిపి 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన మోకాలు సర్జరీ నిమిత్తం దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్న  విషయం తెలిసిందే . కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఉంటే చివరి షెడ్యూల్ పూర్తి చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: