సమంత చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల జోరు పెంచింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ చేసి అందరి మతులు పోగొడుతుంది.. ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో సామ్ ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. సినిమా విడుదల కాకముందే విమర్షలను అందుకుంది. సాంగ్ మగవాల్ల మనో భావాలను దెబ్బ తీసెలా ఉందని కొందరు ఫిర్యాదు కూడా చేశారు.. అయిన చిత్ర నిర్మాతలు వెనక్కి తగ్గకుండా సినిమాను విడుదల చేశారు.


ఆ విడుదల అయ్యి నెలకు పైగా అయ్యింది. అయిన కూడా ఆ పాటకు క్రేజ్ మాత్రం తగ్గలేదు.. యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ పాటకి ఇప్పటికే సోషల్ మీడియా లో రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఊ అంటావా అంటూ స్టెప్పులేస్తుంటే.. పాలు తాగె పిల్లలు కూడా ఈ పాటను పాడుతున్నారు. ఊ అంటావా పాటలో సమంతా హాట్ గా కనిపించిందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అందరూ ఒప్పుకున్నారు.. తాజాగా హీరోయిన్ ప్రియమణి కూడా సమంతను కామెంట్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


ఓ ఇంటర్వూ లో మాట్లాడిన ప్రియమణి, పొట్టి బట్టలు వేసుకుని హీరో పక్కన నటిస్తే చాలనుకునే రోజులు పోయాయని.. హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలే చేయాలన్న దానికి కాలం చెల్లి కథానాయికల కు ప్రాధాన్యం రోజు రోజుకు పెరిగిపొయింది.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఇలాంటి పాత్రలు చేసే హీరోయిన్ల కు డిమాండ్ కూడా ఎక్కువే..సమంత ఓ బేబీ, నయనతార నేట్రికన్‌, మాయ సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పింది. సామ్ చేసిన పాటకు తన భర్త కూడా ఫిధా అయినట్లు ఈ సందర్భంగా చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: