తమిళ నాట హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో శింబు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఎన్నో అప్డేట్ లతో ప్రేక్షకులను వచ్చి వారిని అలరించాడు. ఇటీవల మానాడు చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పూర్వవైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయగా ఆ సినిమా హిట్ ఆయనకు మంచి పేరు ను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసిన ఈ హీరో ఆ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియజేశాడు.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గ్లింప్స్ సినిమా భారీ స్థాయిలో ఉంటుందని తెలియజేసింది. విజువల్స్ కూడా సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్ గౌతమ్ వాసుదేవ్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. టాలీవుడ్ లో కొన్ని తెలుగు సినిమాల ద్వారా అందరికీ సుపరిచితుడే శింబు. ఇక్కడ కూడా ఆయన నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.

ఆయన హీరోగా నటించిన మన్మధ చిత్రం తెలుగులో ఆయనకు భారీ స్థాయిలో ఇమేజ్ పెరగడానికి కారణం అయింది అని చెప్పవచ్చు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో భారీ స్థాయిలో ఇప్పుడు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగు సినిమాల కంటే పైగానే ఉన్నాయి అవి సూపర్ హిట్ అయి తప్పకుండా ఆయనకు గొప్ప పేరు తీసుకు వస్తాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది నయనతార తో ప్రేమ వ్యవహారం లో హీరో బాగా నలిగిపోయాడు అప్పటి నుంచి ఆయన బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్లీ ఉన్నట్లుగానే కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: