శర్వానంద్ తాజాగా నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు,  ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు, అందులో భాగంగా ఈ తరుణంలో తాజాగా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ కథ విన్న ప్రతి ఒక్కరూ మంచి మూవీ అవుతుందని నమ్మి పని చేశారు, శర్వానంద్ సహకారం మరువలేనిది రష్మిక మందన బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ ను అడ్జస్ట్ చేసి సహకరించింది,  ఈ సినిమాలో కుష్బూ చేసిన పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేము,  రాధిక గారితో వర్క్ ఎక్స్ పిరియన్స్ చాలా బాగుంది,  కుటుంబం అంతా కలిసి చూడవలసిన సినిమా ఇది అని మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ...  శతమానం భవతి, మహానుభావుడు లాంటి సినిమాలు చేయడం లేదని చాలామంది అడుగుతున్నారు,  ఈ సినిమా దానికీ సమాధానం చెబుతుంది.

 మూవీ చూసిన అందరూ మంచి సినిమా చూశామనే చిరునవ్వుతో ఇంటికి వెళ్తారని చెప్పగలను అని శర్వానంద్ విలేకర్ ల సమావేశంలో తెలియజేశారు, అలాగే అంతకుమించి ఇప్పుడే ఏమీ చెప్పలను రాధిక, కుష్భూ లాంటి నటులతో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది,  ఇది నాకు ఒక అచీవ్మెంట్ ఇందులో పాత శర్వానంద్ అని చూస్తారు అని శర్వానంద్ తెలియజేశాడు, ఇదిలా ఉంటే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు, శర్వానంద్ ఈ సినిమా తో పాటు ఒకే ఒక జీవితం సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు,  ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: