తెలుగులో తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.కాగా నానీ, రామ్, నాగ చైతన్య లాంటి హీరోలు దక్షణాదిలో పాగా వేసేందుకు ట్రై చేస్తున్నారు.కాగా ఇక్కడే మార్కెట్ పెంచుకొనే పనిలో పడ్డారు. అయితే ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేస్తూ తెలుగుతో పాటు పొరుగు రాష్ట్రాలలో కూడా సినిమాలు రిలీజ్ అయ్యేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. ఇక  ఈ కోవలో నానీ, రామ్ ఇప్పటికే సౌత్ సినిమాలు మొదలు పెట్టేస్తే చైతూ ఇప్పుడు రెడీ అవుతున్నాడు.తాజాగా డైవర్స్ తర్వాత పనిలో పడిన నాగ చైతన్య ఇప్పుడు ఏకంగా అరడజను సినిమాల లైనప్ తో సిద్దమవుతున్నాడు. 

ఇటీవల బంగార్రాజు సక్సెస్ తో సంక్రాంతి హీరోగా నిరూపించుకున్న చైతూ త్వరలోనే థాంక్యూ చెప్పబోతున్నాడు. అయితే తనకి మనం లాంటి మెమరబుల్ సినిమాను ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఇప్పుడు మరోసారి థాంక్యూ సినిమాకు కలిసి పనిచేస్తున్నాడు. ఇక  ఆ తర్వాత వరసగా ఐదు సినిమాలు లైన్లో ఉన్నాయి చైతూ కోసం.కాగా చాలా గ్యాప్ తరువాత ‘అల్లరి’ నరేశ్ కి హిట్ ఇచ్చిన సినిమా నాంది.అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడలతో చైతూ ఒక సినిమా చేయనున్నాడు. అంతేకాదు వైవిధ్యమైన కథలతో ఎంటర్ టైన్ చేయగలిగే లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక  ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన

 ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. కాగా టాలీవుడ్ యంగ్ హీరోలకు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు లవ్ స్టోరీలు ఇచ్చే కిశోర్ తిరుమలకి కూడా చైతూ ఓకే చెప్పేశాడు. దీనిని డీవీవీ దానయ్య నిర్మాణంలో.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో తానేంటో నిరూపించుకున్న రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా చైతూ ఓ సినిమా చేయనున్నాడు.అయితే ఇది ‘టైమ్ ట్రావెల్’కి సంబంధించిన సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇటీవల సురేశ్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయడానికి చైతూ ఓకే చెప్పగా ఇది తమిళంలో హిట్ కొట్టిన ‘మానాడు’ సినిమాకి ఇది రీమేక్. కాగా మరో వైపున పరశురామ్ తో అనుకున్న సబ్జెక్టు సిద్ధం అయింది. అయితే మహేష్ సర్కారు వారి పాట పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: