కొన్ని వేల కోట్ల ఆస్తులకు వారసుడిగా చలామణి అవుతున్న మహేష్ బాబు ఇతరులతో ఎఫైర్స్ అనే విషయంపై ఎప్పుడూ కూడా ఈయన మొగ్గు చూపలేదు.. నమ్రత ను ప్రేమించి మరి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక మహేష్ బాబు కి ఎవరితోనూ ఎఫైర్ లేకపోవడానికి గల కారణాలు కూడా చాలానే ఉన్నాయి.. నిజానికి మహేష్ బాబు వంశీ సినిమా ద్వారా నమ్రత ను కలిసాడు.. ఇక వీరిద్దరూ ఈ సినిమాలో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.. కాబట్టి ఈ సినిమాతోనే తొలి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
ఇక వీరిద్దరూ ఒకరి కొకరు ప్రేమించుకొని.. ఆ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా వీరి పెళ్లికి కృష్ణ ఒప్పుకోలేదట.. తల్లిదండ్రులను కాదని మహేష్ బాబు నమ్రత ముంబైలో వివాహం చేసుకోవడం జరిగింది.. అంతే కాదు వీరిద్దరికీ పలువురు స్టార్ హీరోలు కూడా సపోర్ట్ చేసినట్లు సమాచారం.. ఈ విషయాన్ని వారే కృష్ణతో స్వయంగా తెలియజేసి వీరిద్దరికి మళ్లీ ఘనంగ వివాహం జరిపించారు కృష్ణ. ఆమెపై ఉన్న ఆ ఇష్టంతోనే ఆయన మరొక అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.