తాజాగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా లోని 'పెన్నీ' అనే సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది.ఇకపోతే ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ విడుదల అయ్యాయి. అయితే రెండు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇకపోతే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ పెన్నీ... ఇక సాంగ్ తో మహేష్ వారసురాలు సితార ఘట్టమనేని వెండితెర ఎంట్రీ ఇవ్వడం విశేషం.ఇకపోతే ఈ సాంగ్ లో సితార స్టైలిష్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.కాగా యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్న పెన్నీ సాంగ్ కి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు స్టెప్స్ వేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే  తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ సిస్టర్ మంజుల చేరారు.అయితే తాజాగా ఆమె పెన్నీ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ వేస్తూ ఓ వీడియో చేశారు. ఇక సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే చాలా మంది సన్నిహితులు పెన్నీ సాంగ్ కి డాన్స్ చేయాలంటూ కోరుతున్నారట.అయితే  వాళ్ళ డిమాండ్ మేరకు పెన్నీ సాంగ్ చేశానంటూ మంజుల కామెంట్ చేశారు. దీనితో మంజుల పెన్నీ సాంగ్ వీడియో వైరల్ గా మారింది.ఇక ఇదిలా వుండగా సర్కారు వారి పాట విషయానికొస్తే మహేష్ షూటింగ్ పూర్తి చేశారు.ఇకపోతే  ఈ సినిమా  మే 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. కాగా దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే పలు కారణాల చేత సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట ఆలస్యమైంది. ఇకపోతే మహేష్ చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలై రెండేళ్లు దాటిపోయింది. అయితే దీనితో ఫ్యాన్స్ సర్కారు వారి పాట చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: