సౌత్ ఇండియన్ స్టార్స్ కు నార్త్ ఇండియాలో హీరోయిన్‌గా రాణించాలంటే చాలా కష్టం. అప్పట్లో శ్రీదేవి, జయప్రదకు మాత్రమే ఈ అవకాశం వచ్చింది. వీరి తర్వాత ఏ స్టార్ హీరోయిన్ బాలీవుడ్‌లో రాణించలేదు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. సౌత్ స్టార్ హీరోయిన్లు రష్మిక, సమంత సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో రష్మిక రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ సినిమాలో నటించనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రష్మికతో పోల్చుకుంటే సమంత స్పీడ్ వేరే లెవల్.


సమంత.. ఒక వైపు వెబ్ సిరీస్, మరో వైపు సినిమాలు, యాడ్స్ చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్లున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత.. బాలీవుడ్‌లో ‘ఫ్యామిలీ మెన్-2’ వెబ్ సిరీస్‌తో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. వెబ్ సిరీస్‌తోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే ఓ స్టార్ హీరోతో కలిసి నటించేందుకు ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమాకు కుమార్ మంగత్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.


కాగా సమంత ప్రస్తుతం తమిళంలో ‘కాత్తువాక్కుల రెండు కాదల్’, తెలుగులో ‘శాకుంతలమ్’ సినిమాలు పూర్తి చేసి.. ‘యశోద’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మూవీ ‘ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమా చేయనున్నారు. అలాగే త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి నటించనున్నట్లు సమాచారం. అయితే తాజాగా సమంత హీరో నాగ చైతన్యతో కలిసి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు.


డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో హీరో నాగ చైతన్య నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలని నందిని భావిస్తున్నారట. అయితే ఇప్పటికే నందిని-సమంత కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ సినిమా వచ్చింది. అలాగే వీరిద్దరు మంచి స్నేహితులు. కాబట్టి తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నందిని అడిగితే సామ్ ఒప్పుకోవచ్చని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే సమంత-నాగచైతన్యను మళ్లీ తెరపై చూడవచ్చని అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: