పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యే ముందు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ స్టార్ హీరో ఇప్పుడు తన మాజీ భార్య పై పరువు నష్టం దావా వేయడం జరిగింది. నటి అంబర్ హెర్డేన్ మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2015లో వీరువివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడాదికి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే జానీ డెప్ తో విడిపోయినప్పటికీ తనని గృహ హింసకు గురి చేస్తున్నట్లు గా అంబర్ హెర్డ్ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం వెల్లడించారు.


దీంతో దీనిని వ్యతిరేకిస్తూ జానీ డెప్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. తన మాజీ భార్యపై రూ.380 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో కొనసాగుతూనే ఉన్నది. నేను ఇంటి నుండి బయలుదేరడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పుడు ఆమె నన్ను తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డుల తో కలిసి .. ఎలివేటర్ వద్ద అరుస్తూ ఏడుస్తూ.. నువ్వు లేకపోతే నేను జీవించలేను అంటూ నువ్వు బయటికి రావాలని బయటినుంచి ఆరోపించేదని జానీ ఆరోపించారు.

అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో ఇంటి పైకి వస్తువులను కూడా విసిరేదని తెలియజేశారు అలాగే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందని మానసిక వేదనకు గురి చేస్తోందని తెలియజేశారు. ఇక కొన్ని సందర్భాలలో వైన్ గ్లాస్ ,టీవీ రిమోట్ ను తన తలకి విసిరేది అని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని తెలియజేశారు. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో బెడ్ పై మలం కూడా వచ్చేదని జానీ తెలియజేశారు. వీటన్నిటికీ బుధవారం కోర్టులో సాక్ష్యం చూపించారు అనంతరం ఈ కేసు వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: