డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ మధ్య కాలంలో వరుసగా ఆయన సినిమాలు రాకపోవడంతో ప్రస్తుత జనరేషన్ కి ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. గతంలో రోజా, బొంబాయి, దళపతి, గీతాంజలి వంటి సినిమాలను డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించడం జరిగింది. ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఒక సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం ఎంతో మంది డైరెక్టర్లు పుట్టుకొస్తూనే ఉండడంతో ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

అలాంటి మణిరత్నం సుహాసిని ని పెళ్లి చేసుకుంది.. అప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ఈమె వివాహం చేసుకున్నది. డైరెక్టర్ మణిరత్నం ప్రతిభకు మనసు పారేసుకున్న సుహాసిని ఆయనను వివాహం చేసుకోవడం జరిగినట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రేమ వివాహం కాదనీ.. కేవలం పెద్దలు కుదిర్చిన వివాహమే అని సుహాసిని తెలియజేసింది. తాజాగా ఒక సందర్భంలో వీరి వివాహానికి సంబంధించి ఒక ప్రస్తావన గురించి తెలియజేసింది. సుహాసిని హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందట. అలా కొన్ని సినిమాలలో నటించిన తర్వాత తనకి మంచి క్రేజ్ రావడం జరిగిందట.

ఆ సమయంలో తన వరస సినిమాలు చేస్తున్నప్పుడు తనకు కథ చెప్పడానికి దర్శకుడు మణిరత్నం వచ్చారు. పైన చెప్పిన కథ నాకు నచ్చకపోవడంతో నేను ఆ సినిమా చేయనని చెప్పాను. అప్పుడు ఆయన ఏ విధంగా ఫీల్ కాకుండానే.. ఓకే అని చెప్పి వెళ్లిపోయారట. అదంతా కూడా చాలా సాధారణం గానే జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే మణిరత్నం అన్నగారు.. సుహాసిని నాన్నగారు మంచి స్నేహితులట. వారిద్దరూ కలిసి మణిరత్నం గారితో నా వివాహం చేస్తే బాగుంటుందని అనుకోవడం తో.. సుహాసిని తండ్రి ఆ విషయాన్ని తనకు చెప్పారట. ఒకసారి మణిరత్నం గారితో మాట్లాడారని సుహాసిని అడిగిందట. అలా మాట్లాడిన తర్వాత తమ ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఒకటే అని తెలుసుకున్న సుహాసిని ఆ తర్వాత వివాహం చేసుకున్నామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: