యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని పాన్ ఇండియా రేంజ్ లో సాధించడంతో మొదటి నుండి ప్రేక్షకుల్లో కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఈ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా విడుదలైన ప్రతి చోట నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్ లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.  ఇది ఇలా ఉంటే చాలా మందికి ఈ సినిమాలో నటించిన నటీనటులకు , దర్శకుడికి,  ఇతర సాంకేతిక నిపుణులు ఎంత ఎంత రెమ్యునరేషన్ అందుకున్నరో  తెలుసుకోవాలని ఉంది.  అయితే అందుకు సంబంధించిన సమాచారం ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.  దాని ప్రకారం ఈ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో చూద్దాం.

కే జి ఎఫ్ మూవీ హీరో యాష్ కే జి ఎఫ్ సినిమా కోసం 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 
కే జి ఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్సినిమా కోసం 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

 
కే జి ఎఫ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన సంజయ్ దత్సినిమా కోసం తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


కే జి ఎఫ్ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టిసినిమా కోసం మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 
రవీనా టాండన్ కే జి ఎఫ్ సినిమా కోసం 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.


కే జి ఎఫ్ సినిమా కోసం ప్రకాష్ రాజ్ 82 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: