అవును అల్లు అర్జున్ సినిమా ముందు మహేష్ మరియు ప్రభాస్ సినిమాలు నిలబడలేకపోయాయి. నిజానికి అల్లు అర్జున్ కంటే మహేష్ మరియు ప్రభాస్ ల క్రేజ్ ఎక్కువే.మాస్, క్లాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించగల సత్తా కలిగిన హీరోలు వారు. అలా అని అల్లు అర్జున్ తక్కువేమి కాదట.. అతను రాజమౌళి అన్నట్టే ఓ స్లో పాయిజన్ లాంటి వాడు. కాకపోతే వాళ్ళ సినిమాలకి ఓ మాదిరి టాక్ వచ్చినా కానీ దుమ్ము రేపుతాయి.


అల్లు అర్జున్ సినిమాకి దర్శకుడి క్రేజ్ అదనంగా ఉంటేనే సినిమా నిలబడుతుందట.అయితే ఒకప్పుడు మాత్రం అల్లు అర్జున్ కంటే మహేష్ మరియు ప్రభాస్ ల స్టార్ డం కాస్త తక్కువగా ఉండేది. సరిగ్గా ఇప్పుడు మనం ఆ రోజుల్లోకే వెళ్ళబోతున్నాం. 2004 వ సంవత్సరం మే 7వ తారీఖున అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' చిత్రం విడుదల అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.దిల్ రాజు నిర్మాత. మొదట ఈ చిత్రం అతి తక్కువ థియేటర్లలో విడుదల అయ్యింది.


 


కానీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుందట.. తర్వాతి వారం అంటే మే 14న మహేష్ బాబు నటించిన 'నాని' చిత్రం విడుదల అయ్యింది. ఈ మూవీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుందట.ఎస్.జె.సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మంజుల నిర్మించింది. ఈ మూవీ మంజులకి భారీ నష్టాలనే మిగిల్చింది. చాలా చోట్ల 'నాని' చిత్రాన్ని ఒక్కరోజుకే తీసేసి మళ్ళీ 'ఆర్య' చిత్రాన్ని ప్రదర్శించాయట చాలా థియేటర్లు.


 


ఆ తర్వాత వారం అంటే మే 21న ప్రభాస్ నటించిన 'అడవి రాముడు' చిత్రం విడుదల అయ్యింది. 'వర్షం' తో సూపర్ హిట్ కొట్టి క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ హీరో మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన మూవీ. కానీ 'ఆర్య' ముందు ఈ మూవీ కూడా నిలబడలేకపోయిందట.. కొన్ని ఏరియాల్లో 50 రోజులు ఆడింది కానీ 'ఆర్య' సినిమా కలెక్షన్స్ లో సగానికి సగం కూడా కూడా ఈ మూవీ రాబట్టలేకపోయిందట.. అలా 2004 సమ్మర్ కు అల్లు అర్జునే విన్నర్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: