మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరియు  సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. అయితే రామకృష్ణ - మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లుగా సినిమా ప్రారంభం అయ్యింది.ఇకపోతే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక వాళ్ళ స్థానంలో రవీందర్ రెడ్డిని తీసుకున్నారట.అయితే రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకు రామకృష్ణ - మౌనిక పని చేశారు.కాగా తాజాగా  'పుష్ప', 'తలైవి' తదితర పాన్ ఇండియా సినిమాలు చేశారు.ఇకపోతే  హీరోతో వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి.అయితే  మరి, ఎవరితో పడలేదు?

 ఏమిటి? అనే వివరాలు తెలియలేదు. ఇకపోతే కానీ, రామకృష్ణ - మౌనిక స్థానంలో రవీందర్ రెడ్డి ఎంపిక వెంటనే జరిగింది. కాగా రామ్ చరణ్ 'మగధీర'కు రవీందర్ రెడ్డి పని చేశారు. ఇక ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.అయితే అమృత్‌సర్‌లో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ పాల్గొనగా ఒక షెడ్యూల్ చేశారు.ఇక ఆ తర్వాత విశాఖలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. కాగా అంతకు ముందు రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.అయితే  సుమారు 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది.ఇకపోతే  ఈ తరుణంలో ప్రొడక్షన్ డిజైనర్ మార్పు అనేది ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది.

అయితే ఏదో గొడవ అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు.ఇక రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.కాగా  ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు  తమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే తన 16వ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. తన తదుపరి చిత్రం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో చేస్తున్న విషయం అందరికి తెలిసిందేమ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: