మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది విరాట పర్వం సినిమా. డైరెక్టర్ వేణువుల దర్శకత్వంలో హీరో రానా, హీరోయిన్ సాయి పల్లవి నటించగా ఇందులో కీలకమైన పాత్రలో హీరోయిన్ ప్రియమణి కూడా నటించింది. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే ప్రయత్నిస్తోంది చిత్రబృందం. ముఖ్యంగా ఈ సినిమా విడుదల కోసం ఎంతో మంది చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కించిన కథ చిత్రంలో రవిశంకర్ పాత్రలో రానా కనిపిస్తూ ఉండగా.. వెన్నెల పాత్రల సాయి పల్లవి నటిస్తున్నది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచయని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో వేగవంతం చేశారు ఇందులో భాగంగానే ట్విట్టర్ వేదికగా కాస్త డిఫరెంట్ స్లో మోషన్ వీడియో ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఆ వీడియో చూసిన సాయి పల్లవి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది

ఈ వీడియోలో 30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్ ఒక అభిమానిగా రానా ఆఫీస్ వద్దకు వెళ్లి హంగామా చేయడం జరుగుతోంది.. విడుదల తేదీ అనౌన్స్మెంట్ చేశారు గానీ ప్రమోషన్స్ ఏవి అని హంగామా చేశారు. రానా ఆఫీసు నుంచి బయటికి వచ్చి తాను సాయి పల్లవి ని చూడడానికి చాలా వెయిటింగ్ చేస్తున్నాను అని అభిమాని అడగగా. అందుకు రానా బదులిస్తు తాను కూడా ఆమె అభిమానినే అని ఆమె కోసమే ఈ సినిమా తీశానని తెలియజేశాడు. ఆమె ఫ్యాన్స్ కోసం కర్నూలులో జూన్ 5న ట్రైలర్ విడుదల చేస్తున్నామని ఈ వేడుకకు ఆమె కూడా వస్తోందని తెలిపారు. అయితే ఇదంతా చూసిన సాయి పల్లవి ఇక్కడ అంత సీన్ లేదని ప్రజలు ప్రేమను పొందడం వల్ల నేను అదృష్టవంతురాలిని. కర్నూల్ వారందరికీ చూసేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ ట్విట్టర్లో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: