ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఉంది రష్మిక మందన్న. శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చి అగ్ర హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది అక్కడ పలు సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ సినిమా పరిశ్రమలో సైతం ఈ ముద్దుగుమ్మ తన హవా కొనసాగిస్తోంది.

తమిళ కన్నడ సినిమాల్లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ అగ్రహీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలను ఎంచుకునే విధానం పట్ల చాలామంది ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. తన సినిమాలలో తన పాత్ర ఎంతో బాగా ఉంటేనే వాటికి ఓకే చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. లేదంటే ఎంత పెద్ద దర్శకుడైన ఎంత పెద్ద హీరో అయినా కూడా ఆ సినిమాను నువ్వు చెబుతూ నిర్మొహమాటంగా వెళ్లి పోతుందట. 

నేషనల్ క్రష్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప రెండవ భాగం సినిమాలో చేస్తోంది. అంతేకాకుండా తమిళనాట విజయ్ దళపతి వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. మలయాళంలో కూడా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విధంగా చేస్తూ చేస్తూ రష్మిక మందన ఇండియన్ మోస్ట్ హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భవిష్యత్ లో ఆమె ఎలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇప్పటికైతే టాలీవుడ్ లో ఆమె నంబర్ వన్ హీరోయిన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: