ప్రస్తుతం
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర
హీరోయిన్ గా ఉంది
రష్మిక మందన్న.
శాండిల్ వుడ్ నుంచి
టాలీవుడ్ లోకి వచ్చి అగ్ర
హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్
హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ
బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది అక్కడ పలు సినిమాలతో బిజీగా ఉంది. సౌత్
సినిమా పరిశ్రమలో సైతం ఈ ముద్దుగుమ్మ తన హవా కొనసాగిస్తోంది.
తమిళ
కన్నడ సినిమాల్లో కూడా సినిమాలు చేస్తూ అక్కడ అగ్రహీరోయిన్ గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలను ఎంచుకునే విధానం పట్ల చాలామంది ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. తన సినిమాలలో తన పాత్ర ఎంతో బాగా ఉంటేనే వాటికి ఓకే చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. లేదంటే ఎంత పెద్ద దర్శకుడైన ఎంత పెద్ద
హీరో అయినా కూడా ఆ సినిమాను నువ్వు చెబుతూ నిర్మొహమాటంగా వెళ్లి పోతుందట.
నేషనల్
క్రష్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో
అల్లు అర్జున్ సరసన పుష్ప రెండవ భాగం సినిమాలో చేస్తోంది. అంతేకాకుండా తమిళనాట
విజయ్ దళపతి వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో కూడా
హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా పాన్
ఇండియా సినిమాలు కావడం గమనార్హం. మలయాళంలో కూడా
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఆమె
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విధంగా చేస్తూ చేస్తూ
రష్మిక మందన
ఇండియన్ మోస్ట్
హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భవిష్యత్ లో ఆమె ఎలాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇప్పటికైతే
టాలీవుడ్ లో ఆమె నంబర్ వన్
హీరోయిన్ .