ఇటీవల తమిళంలో ఘన విజయం అందుకున్న 'వినోదయ సితం' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసినిమాలో లీడ్ రోల్ పోషించబోతున్నారు. తమిళంలో స్వీయ దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమాని తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే వీలైనంత త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ కోసం విశ్వనటుడు కమల్ హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట మేకర్స్. ఈమధ్య విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కమలహాసన్. ఇన్నాళ్లూ వరుస పరాజయాలతో సతమతమవుతున్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా భారీ కం బ్యాక్ అందించింది. దీంతో విక్రమ్ సక్సెస్ తో వరసగా సినిమాలు చేస్తానని అభిమానులకు హామీ కూడా ఇచ్చారు కమల్. ఇక తెలుగులోనూ విక్రమ్ సినిమా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వినోదయ సితం సినిమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో కమల్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రఖని తమిళంలో మంచి పేరున్న నటుడు, దర్శకుడు కూడానూ.

అలాగే పవర్ స్టార్ సినిమా అంటే కమల్ హాసన్ నో చెప్పే అవకాశమే లేదు. ఇక ఈ సినిమాలో కేవలం పది నిమిషాల నిడివి మాత్రమే కమల్ హాసన్ పాత్ర కు ఉండబోతుందట. మరి ఈ ఇంపార్టెంట్ పాత్రలో కమల్ హాసన్ నటించేందుకు ఒప్పుకుంటాడా? లేదా అనేది త్వరలోనే తెలియనుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాని కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వినోదయ సితం రీమేక్ ని సెట్స్పైకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: