నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విరాట పర్వం' సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం అందరికి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. 1990లో సరళ అనే మహిళ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు వేణు ఉడుగుల. ఇక జూన్ 17 న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ శనివారం నిర్వహించిన విరాటపర్వం సక్సెస్ మీట్ లో పాల్గొన్న సాయిపల్లవి తాను పోషించిన పాత్ర గురించి చెబుతూ..

 కొన్ని ఎమోషనల్ కామెంట్ చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.." సరళ గారి అన్నయ్య మోహన్ రావు గారికి ధన్యవాదాలు. వారింటికి వెళ్లి వాళ్లను కలిసినప్పుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు.సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత నా గుండె బరువెక్కింది. కన్నీళ్ళు వచ్చాయి. గొప్ప మనసు ఉన్న వాళ్ళు మళ్లీ పుడతారు, వాళ్ళు ఏమనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈరోజు మోహన్ రెడ్డి గారు ఇక్కడికొచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. సురేష్ బాబు గారు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను.

సినిమాలో వెన్నెల పాత్ర పోషించేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని, చూసిన ప్రతిసారి ఇంకా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడండి చూసిన ప్రతిసారి కొత్త అనుభూతిని పొందుతారు" అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానా రవన్న అనే కామ్రేడ్ పాత్రలో నటించగా.. సాయిపల్లవి వెన్నెల అనే పాత్రను పోషించింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: