తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వారిని మాత్రం సరిగ్గా ఇంతవరకు ఏ డైరెక్టర్ ఉపయోగించుకోలేకపోతున్నారు. అలా ఉపయోగించుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి వారిలో ముఖ్యంగా యువ హీరో ఆది పినిశెట్టి ఒకరిని చెప్పవచ్చు. పవర్ ఫుల్ పాత్రలో కనిపించి బాగా ఆకట్టుకుని సత్తా ఉన్న హీరో ఆది పినిశెట్టి. అయితే ప్రస్తుతం హీరో రామ్ నటిస్తున్న ది వారియర్ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తూ ఉన్నది. జులై 1న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్లు ఆది పినిశెట్టి కనిపించిన విధానం మునుపేన్నడు లేని విధంగా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలోని ఆధిపనిశెట్టి చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇక ఇందులో గురు పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఈ హీరో బిజీ కావడం ఖాయమని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాలలో నటించిన ఆ తర్వాత కాస్త డల్ గా అనిపించినా అది పినిశెట్టి వారియర్ చిత్రంతో ఒకేసారి ఫామ్ లోకి రావడం గ్యారెంటీ అన్నట్లుగా సమాచారం



అయితే ఇవే మాటలు కూడా గతంలో చాలానే వినిపించాయి ఆది పినిశెట్టి మొదటిసారిగా విలన్ గా మారిన సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను అత్యంత పవర్ఫుల్ పాత్రలో నటించారు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని కూడా ఈ చిత్రం ఆ తర్వాత ఆది పినిశెట్టి భారీ స్థాయిలో ఆఫర్లు వస్తాయని అందరు అనుకున్నారు కానీ అలా ఏమీ జరగలేదు. కేవలం అజ్ఞాతవాసి సినిమాలో నటించే అవకాశం వచ్చింది అది కూడా ప్లాప్ దిశగా అడుగులు వేసింది. కానీ రంగస్థలం సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: