ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ పై ఫుల్ గా కాన్సన్ట్రేషన్ పెట్టిన అల్లు అర్జున్సినిమా పూర్తి కాగానే తాను చేయబోయే తదుపరి చేయబోయే సినిమాలకు కూడా అదిరిపోయే దర్శకులను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పుష్ప ది రూల్ మూవీ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇలా తనకు కెరీర్ లో మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర ఇచ్చిన దర్శకులతో మరోసారి సినిమాలు చేయడానికి అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలకు అదిరిపోయే లైన్ అప్ ని సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: