సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన బ్రహ్మోత్సవం , స్పైడర్ మూవీ లతో వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాడు . ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను మూవీ తో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర మరోసారి నిరూపించుకున్నాడు .

ఆ తర్వాత వరుస పెట్టి మహర్షి , సరిలేరు నీకెవ్వరు మూవీ లతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న మహేష్ బాబు తాజాగా విడుదలైన సర్కారు వారి పాట మూవీ తో మరో విషయాన్ని కూడా బాక్సా ఫీస్ దగ్గర అందుకని వరుస విజయాల పరంపరను అలాగే కొనసాగిస్తున్నారు . ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్ట్ నెల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో పాల్గొనబొతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . అలాగే ఈ మూవీ ని 2023 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర  బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా ,  తమన్ సంగీతాన్ని అందించబొతున్నాడు . 

ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణుల గురించి మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ లో పెద్దగా లుక్ పరంగా ఎలాంటి చేంజ్ లేకుండా సాధారణంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా త్రివిక్రమ్ మూవీ కోసం మహేష్ బాబు చాలా సింపుల్ గా కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: