సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న కేసులు బాగా ఎక్కువయ్యాయి.ఇదిలావుంటే ప్రేమించి వివాహం చేసుకున్నవారు సైతం విడాకులు తీసుకోవడానికి పెద్దగా ఆలోచించడం లేదు.ఇక  ఇప్పుడు అదే బాటలో ఒకప్పటి స్టార్ దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూపావైట్ల తన భర్త నుంచి విడిపోవడం కోసం హైదరాబాదు నాంపల్లి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ జంటకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఇదిలావుంటే నిజానికి రూప వైట్లకు శ్రీనువైట్ల స్వయంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్పించి తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పెట్టుకోవడమే కాక సమంత, కాజల్ అగర్వాల్ వంటి వారితో పని చేసే అవకాశం కూడా కల్పించారు. 

 ప్రస్తుతానికి ఆమె ఆ పనికి దూరమై ఒక ఆర్గానిక్ మిల్క్ వ్యాపారం చేస్తున్నారు.నిజానికి నాలుగేళ్ల నుంచి ఈ జంట విడిగానే ఉంటుందని ఇక కలవడం కష్టమని భావించి ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది.ఇదిలావుంటే ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ జంట నిజానికి రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకోవడానికి ప్రయత్నించారట. కానీ ఇద్దరి తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడి కొన్నాళ్ళు వేచి చూడండి అని ఒప్పించారట.  అప్పటికి తల్లిదండ్రుల మాటలతో కాస్త కన్విన్స్ అయ్యారు కానీ శ్రీనువైట్ల యాటిట్యూడ్ తో రూప ఇబ్బంది పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దానికి తోడు ఆయనకు సరైన ఇన్కమ్ సోర్స్ లేకపోవడం,

గతంలో ప్రకటించిన ఢీ సీక్వెల్ సినిమా కూడా చేస్తారో లేదో తెలియకపోవడం వంటి అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆమె విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అయితే ఇక దానికి తోడు రూప వైట్ల నిర్ణయం వెనుక సమంత ప్రభావం కూడా ఉండి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇకపోతే నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు రూప వైట్ల సమంతకు పర్సనల్ డిజైనర్ గా కూడా వ్యవహరించారు.కాగా  ఫుల్ టైం కాకపోయినా అడపాదడపా సమంతకు కొన్ని అవుట్ ఫి ట్లు రూప డిజైన్ చేస్తూ ఉండేవారు.అంతేకాకుండా  అలా సమంతతో క్లోజ్ గా ఉండే ఆమె సమంత విడాకులు తీసుకున్న తర్వాత తాను కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. తమ బంధం ఎంతో కాలం సాగదు అనుకున్న సమయంలో విడిపోయి ప్రశాంతంగా ఉండడం బెటర్ అనే నిర్ణయం తీసుకోవడంతో విడాకుల నోటీసుల వరకు వ్యవహారం వెళ్లిందని తెలుస్తోంది. ఈ విషయం గురించి శ్రీనువైట్ల సహా రూప వైట్ల కూడా ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: