పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని ప్రేక్షకులంటూ ఉండరు.అయితే ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఒక వైపు సినిమాలు మరియు మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టి బిజీగా వున్నాడు. ఇక ఇదిలావుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'హరిహర వీర మల్లు' సినిమా ఓ కొలిక్కి రావడంలేదు.ఇకపోతే సినిమా పూర్తిగా అటకెక్కిపోయిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే,  ఇక సినిమా ఆగిపోలేదనీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు.

కాగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'హరిహర వీర మల్లు' సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.పోతే  పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది.ఇదిలావుంటే దర్శకుడికీ హీరోకీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనీ, ఈ క్రమంలోనే సినిమాలో మార్పులు చేర్పులు తప్పడంలేదనీ ఓ ప్రచారం జరిగింది ఆ మధ్య. ఇదిలావుంటే వస్తున్న ఔట్‌పుట్ పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తితో వున్నారన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.అయితే ఎట్టకేలకు వివాదం సమసిపోయిందనీ,

కొన్ని మార్పులు చేయబోతున్నారన్నది తాజాగా వినిపిస్తోన్న ఊహాగానాల్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలావుంటే క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.అంతేకాకుండా  అన్నీ కుదిరితే కొద్ది రోజుల్లోనే తిరిగి సినిమా షూటింగ్ పునఃప్రారంభమవుతుందట.ఇక మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కల్పించబోతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగగా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో నటిస్తున్న చారిత్రాత్మక సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానంలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: