ఇక దీంతో కొంతమంది డైరెక్టర్ విఫలం కావడం వల్లే.. ఈ సినిమాకు ఇలాంటి ఫలితం వచ్చింది అంటూ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో రాబోతున్న జనగణమన సినిమా పరిస్థితి ఏంటా అని అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు. ఈ సినిమానీ కూడా తామే నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు పూరీ. ఇక ఇప్పుడు లైగర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తన తదుపరి సినిమా జనగణమన ఎలా తీస్తారో అంటూ అభిమానుల సైతం భయపడుతున్నారు.
ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా చెబుతూ ఉన్నారు. ఈ మూవీని మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు..అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి మహేష్ బాబును తప్పించి.. విజయ్ దేవరకొండ తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నానని పూరి జగన్నాథ్ తెలిపారు. చివరికి ఫైనల్ గా విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి ఈ సినిమాని తీయబోతున్నట్లు గడిచిన కొన్ని నెలల క్రితం తెలియజేశారు. లైగర్ ఎఫెక్ట్ తో జనగణమన సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ సినిమా ఉంటుందా.. లేదా అనే విషయం పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.