రౌడీ స్టార్ హీరోగా పేరు పొందాడు విజయ్ దేవరకొండ. పూరి డైరెక్షన్ల లైగర్ సినిమాతో నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం భారీగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది.. ఈ చిత్రానికి నిర్మాతగా ఛార్మి ,పూరి జగన్నాథ్ ,కరణ్ జోహార్ వ్యవహరించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర లో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా విజయ్ దేవరకొండకు కలిసి రాలేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు.


ఇక దీంతో కొంతమంది డైరెక్టర్ విఫలం కావడం వల్లే.. ఈ సినిమాకు ఇలాంటి ఫలితం వచ్చింది అంటూ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో రాబోతున్న జనగణమన సినిమా పరిస్థితి ఏంటా అని అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు. ఈ సినిమానీ కూడా తామే నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు పూరీ. ఇక ఇప్పుడు లైగర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తన తదుపరి సినిమా జనగణమన ఎలా తీస్తారో అంటూ అభిమానుల సైతం  భయపడుతున్నారు.


సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు అని పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా చెబుతూ ఉన్నారు. ఈ మూవీని మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు..అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి మహేష్ బాబును తప్పించి.. విజయ్ దేవరకొండ తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నానని పూరి జగన్నాథ్ తెలిపారు. చివరికి ఫైనల్ గా విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి ఈ సినిమాని తీయబోతున్నట్లు గడిచిన కొన్ని నెలల క్రితం తెలియజేశారు. లైగర్ ఎఫెక్ట్ తో జనగణమన సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ సినిమా ఉంటుందా.. లేదా అనే విషయం పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: