ఇద్దరూ కలిసి కట్టుగా ఎంతగానో వర్క్ ఔట్ చేశారూ. కానీ ఇప్పుడు లైగర్ టాక్ చూస్తే మాత్రం నష్టాలు వచ్చే లాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో చార్మి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లైగర్ సినిమా కోసం ఖర్చు పెట్టాను అంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఇప్పుడు నష్టాలు తప్పేలా లేవు. దీంతో వీరి మధ్య రిలేషన్ ఇలాగే ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కొన్నాళ్ల నుంచి కలిసి సినిమాలు నిర్మిస్తూ ఒకే ఇంట్లో నివసిస్తు.. సహ జీవనం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దాదాపు పదేళ్ల నుంచి పూరి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఛార్మి దర్శనమిచ్చింది.
కానీ ఇప్పుడు లైగర్ దెబ్బకు వీరి బంధం ఎటువైపు వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చార్మి పూరి జగన్నాథ్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ కూడా వినిపిస్తోంది. భర్తను తనకు దూరం చేస్తుంది అనే కారణంతో పూరి భార్య లావణ్య ఛార్మిని కొట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏది ఏమైనా లైగర్ సినిమాపైనే కోటి ఆశలు పెట్టుకున్న ఛార్మి ఇక ఇప్పుడు ఈ సినిమా నిరాశపరచడంతో పూరితో బంధానికి తెరదించి అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.