మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే రామ్ చరణ్ , కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ మూవీ లో కలిసి నటించారు. ఈ మూవీ లో వీరిద్దరి జంటకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇలా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ జంట మరో సారి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ,  సునీల్ , అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

అలాగే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి కూడా అయ్యింది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 2 వ తేదీన ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 2 వ తేదీన ప్రారంభం కాబోయే షెడ్యూల్ షూటింగ్  తో ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం వరకు పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ సినిమాగా తెరకెక్కుతుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపు కుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: