సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజీ లభిస్తూ ఉంటుంది. అలా నటించిన మొట్ట మొదటి మూవీ తోనే దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో శ్రీ నిధి శెట్టి ఒకరు. ఈ ముద్దు గుమ్మ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది.

మూవీ అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించింది. ఇది ఇలా ఉంటే కే జీ ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఈ ముద్దు గుమ్మ చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన కోబ్రా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 31 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శ్రీ నిధి శెట్టి మాట్లాడుతూ ... కోబ్రా అనగానే విక్రమ్ సార్ నాకు గుర్తుకు వస్తారు.

తమిళం లో నా మొదటి మూవీ ని విక్రమ్ సార్ తో చేస్తానని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు.  ఇంత పెద్ద బ్యానర్ లో  .. ఆయన కాంబినేషన్ లో చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. విక్రమ్ సార్ ...  రెహ్మాన్ సార్ ...  మా డైరెక్టర్ గారు ... మంచి కథ ఈ మూవీ కి హైలైట్స్ గా చెబుతాను అంటూ శ్రీ నిధి శెట్టి తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చింది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: