మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఇంకా ఈ మూవీ కి టైటిల్ ని చిత్ర బృందం ఫిక్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి , కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీబ్ని నిర్మిస్తున్నాడు. ఇది వరకే కీయారా అద్వానీ , రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావడం ,  ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇలా భారీ ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ  ఓవర్సీస్ హక్కులు 33 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.  ఇలా ఆర్ సి 15 మూవీ ఓవర్సీస్ లో ఇప్పటికే అద్భుతమైన బిజినెస్ ని జరుపుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: