ఇదివరకే రిలీజ్ చేసిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఇందులో భాగంగా నేడు మూవీ ఫస్ట్ సింగిల్ గా 'దీంతననా' అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్, స్టార్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. పూర్ణచారి సాహిత్యం అందించారు. 'నీ అడుగుల వెంట, నే గురుతై ఉంటా.. నీ పాదమే దాటు ప్రతిచోటునా, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శ కే పొంగిపోతానట, కాలం కలిపింది ఈ జోడి బాగుందని' అని సాగే లిరిక్స్ మళ్లీ మళ్లీ వినాలించేలా ఉన్నాయి. ఈ పాటలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అలానే సిద్ శ్రీరామ్ హిట్ లిస్ట్ లో మరో క్లాసి మెలోడీ యాడ్ అయిందని చెప్పొచ్చు. చిత్రానికిఅచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన 2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రమే 'ఉర్వశివో రాక్షసివో'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్తో కలిసి జిఎ 2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్తో కలిసి జిఎ 2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవంబర్ 4న చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.