ఇటీవలి కాలంలో సమంత నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఏం చేసిన , ఏం మాట్లాడిన కూడా అది హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల సమంత సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటూ వస్తోందట..


ఆమె అమెరికాలో ట్రీట్‌ మెంట్ కారణంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌ అయ్యిందట.. మరికొన్ని వార్తలు వైరల్‌ కూడా అవుతున్నాయి. ఆమె తన ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పిందనే వార్త నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమెకి డబ్బింగ్‌ చెప్పిన చిన్మయి సైతం గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా రాణించిన చిన్మయి.. సమంత పాత్రలకు వాయిస్ ఇవ్వడంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. దశాబ్దం కాలం పాటు వీరి జర్నీ కొనసాగింది. దీంతో ఇద్దరు మంచి ఫ్రెండ్స్కూడా అయ్యారు.


కాని ఇటీవల ఈ ఇద్దరు కలిసి కనిపించడం లేదు. ఇద్దరికి బ్రేకప్ వచ్చిందేమోనని అంటున్నారు. అయితే సమంత తన తల్లి మాట అస్సలు వినడం లేదట. మంచి పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చిన కూడా రిజెక్ట్ చేసిందట. స్టోరీ బాలేదు అని చెప్పి వద్దందట. సద్గురు చూపించిన సంబంధం చేసుకునేందుకు సమంత ఆసక్తి చూపుతున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. సమంత ఇంటివారు ఆమెకు సంబంధాలు చూడటం మొదలెట్టారని టాక్. సమంత కోటీశ్వరుడిని చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది. కానీ ఆ సంబంధానికి నో చెప్పినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత తల్లి బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుందని తెలుస్తుంది.




అతను బాగా కోటీశ్వరుడు కాగా, ఇది అతనికి రెండో పెళ్లి అవుతుందట. అయితే సమంత ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ప్రస్తుతం సమంత నటిస్తున్న `యశోద`, `శాకుంతలం` చిత్రాలకు తనేస్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నట్టు టాక్ నడుస్తుందట.మరి నిజంగానే వీరి మధ్య స్నేహం చెడిందా? లేక డబ్బింగ్‌ సొంతంగా చెప్పుకోవడం వల్ల ఈ పుకార్లు పుట్టాయా అనేది తెలియాల్సి ఉంది. సమంత ప్రస్తుతం `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట.. అలాగే `సిటాడెల్‌` రీమేక్‌ వెబ్ సిరీస్‌లోనూ నటించబోతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: