తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. గతంలో మహేష్ బాబు - సౌందర్య కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో ఆగిపోయింది. కానీ వేరే హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. ఇకపోతే దివంగత నటిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య కూడా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవి , నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించి తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకున్న సౌందర్య .. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రమాదవశాత్తు మరణించడం సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోయింది. ఇదిలా ఉండగా సౌందర్య అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకంటూ ఒక గుర్తింపు కూడా సొంతం చేసుకుంది. అదే సమయంలోనే మహేష్ బాబు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమా కథను రాసుకున్నారు. ఇక కథ కృష్ణకు వినిపించినప్పుడు కథ నచ్చినప్పటికీ మహేష్ బాబు ఇంకా యుక్త వయసుకి కూడా రాని నేపథ్యంలో హీరోగా నటించరని చెప్పారట.

మహేష్ బాబు హీరోగా చేస్తున్నారు అని చెప్పినప్పుడు సౌందర్య హీరోయిన్ గా ఓకే చెప్పిందట. కానీ కృష్ణ.. ఈ సినిమా మహేష్ బాబు చేయడు అని చెప్పడంతో ఆలీ నీ హీరోగా కృష్ణారెడ్డి ఎంచుకున్నారు. ఇక ఆలీ హీరో అని చెప్పినప్పుడు సౌందర్య కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక సౌందర్య స్థానాన్ని ఇంద్రజ భర్తీ చేసింది. ఇక అలా మహేష్ బాబు - సౌందర్య కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆలీ - ఇంద్రజ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొత్తానికైతే కృష్ణ వల్లే వీరిద్దరి కాంబినేషన్ ఆగిపోయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: