టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జయం సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో తన ప్రేయసి షాలిని ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా సమయం కావడం చేత ఈ దంపతులు కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వివాహం చేసుకున్నారు. నితిన్.. నాగర్ కర్నూల్ కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్.. డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె అయిన డాక్టర్ శాలినితో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా రహస్యంగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అలా దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఎట్టకేలకు 2020లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

వృత్తిరీత్యా శాలిని కూడా డాక్టర్ కావడం విశేషం.  ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న నితిన్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శాలిని గర్భం దాల్చిందని త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతుండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నితిన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే శాలిని గర్భం దాల్చింది అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం ఏవి సోషల్ మీడియాలో కనిపించలేదు . కానీ ఎవరో కావాలని రూమర్స్ క్రియేట్ చేశారా లేక నిజంగానే శాలిని గర్భం దాల్చిందా అనే విషయం తేలాలంటే నితిన్ స్పందించాల్సి ఉంటుంది మరి ఈ వార్తలపై నితిన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే అటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు వస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: