బాలీవుడ్ లో బాద్ షా షారుక్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సంచలన విజయాలను నమోదు చేసిన కింగ్ షారుక్ మూవీ వస్తుందంటే హిందీ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.దాంతో షారుక్ మూవీకి పోటీగా ఇతర సినిమాలను రిలీజ్ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తుంటారు బాలీవుడ్ మేకర్స్. అయితే గత కొంత కాలంగా షారుక్ ఖాన్ మూవీస్ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. " చెన్నై ఎక్స్ ప్రెస్ " లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వచ్చిన ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో షారుక్ ఖాన్ పనైపోయిందనే వాదన ఇండియన్ సినివర్గాల్లో గట్టిగానే చర్చ నడిచింది.

దాంతో షారుక్ కొద్దిగా టైమ్ తీసుకొని తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాగైనా అదిరిపోయే హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. ఇక షారుక్ అప్ కమింగ్ మూవీస్ అయిన " పటాన్ ', జవాన్ " పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రెండు మూవీస్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు షారుక్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట. పటాన్ మూవీని జనవరిలో రిలీజ్ చేసి, జవాన్ మూవీని జూన్ లో రిలీజ్ చేసేందుకు షారుక్ ప్రణాళికలు వేస్తున్నదని బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రెండు సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేయబోతున్నాడు.ప్రభాస్ నటిస్తున్న " ఆది పురూష్ ", సాలార్ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఆది పురుష్ జనవరిలో రిలీజ్ అవుతుండగా సలార్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. దాంతో షారుక్, ప్రభాస్ మద్య మూవీస్ క్రేజ్ విషయంలోనూ, కలెక్షన్ల పరంగాను గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు బాలివుడే లో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇక క్రేజ్ పరంగా కూడా బాలీవుడ్ అగ్రహీరోలను తలదన్నే ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో షారుక్ మూవీస్ ప్రభాస్ కు ఎంతవరకు గట్టి పోటీ ఇస్తాయనేది బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: