బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన మొదటి చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమాని కొత్త దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణ తెలకెక్కించారు. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశి నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వర్ష బోలమ్మ నటించింది. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటి లో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అయితే ఈ చిత్రానికి టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమా కలెక్షన్ల గురించి వస్తే..

1). నైజాం-20 లక్షలు.
2). సీడెడ్ -10 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -13 లక్షలు
4). ఈస్ట్ -9 లక్షలు
5) వెస్ట్ -7 లక్షలు
6). గుంటూరు-9 లక్షలు
7). కృష్ణ-9 లక్షలు
8). నెల్లూరు -6 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.83 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్- 13లక్షలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.96 లక్షల రూపాయలు కలెక్షన్ చేసింది.


స్వాతిముత్యం సినిమా థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.84 కోట్ల రూపాయలు జరగక ఈ చిత్రం సక్సెస్ కావాలి అంటే రూ.4 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. అయితే ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం రూ. 96 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా బయ్యర్లకు దాదాపుగా రూ.3 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. కానీ నాని థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టినట్లుగా సమాచారం. ఏది ఏమైనా తన మొదటి సినిమాతోనే థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు బెల్లంకొండ గణేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: