ప్రస్తుతం అనసూయ అమెరికాలో విహరిస్తోంది అంటా మరీ. అక్కడికెళ్లి చాలా కాలం అవుతుండగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో పాటు తన హేటర్స్ కి టచ్ లో ఉంటుంది.

నచ్చిన బట్టలు ధరిస్తూ ఇష్టం వచ్చిన వంటలు రుచి చూస్తూ ఫుల్గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మధ్య మధ్యలో ట్రోలర్స్ ని గిల్లుతూ వీడియోలు చేస్తుంది. నా యాటిట్యూడే మీకు సమాధానం అంటూ వాళ్ళను మరింత రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ, తాజాగా అదిరిపోయే ట్రెండీ వేర్లో గ్లామరస్ ఫోటో షూట్ చేసింది.

సదరు ఫొటోల్లో అనసూయ బ్లౌజ్ ధరించకుండా చీర చుట్టుకున్నట్టు ఉంది మరీ. అనసూయ ధరించిన డిజైనర్ వేర్ అలా తలపిస్తుంది. దీంతో చీరను అలా కూడా చుట్టుకుంటారా? అంటూ నెటిజెన్స్  గాటుగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ డల్లాస్ లో ఉన్నట్లు ఆమె కామెంట్ ద్వారా అర్థం అవుతుంది. తెలుగువారు అధికంగా ఉండే డల్లాస్ లో అనసూయ ఆహ్లాదంగా గడుపుతున్నారు. యాంకర్ గా రిటైర్ అయిన అనసూయకు బాగా విరామం దొరుకుతుంది. దీంతో విచ్చల విడిగా విహారాలు చేస్తున్నారు.

తనకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై చెప్పిన విషయం మన అందరికి బాగా తెలిసిందే. అనసూయ తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. కొన్నాళ్లు స్టార్ మా లో ఒక సింగింగ్ షో యాంకర్ గా చేశారు. ఆ షో ముగియడంతో అనసూయ బుల్లితెరపై కనుమరుగయ్యారు. ప్రస్తుతం అనసూయ బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తుంది. నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ వదిలేశారు.


ఇటీవల అనసూయ నటించిన ఖిలాడీ, దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ చిత్రాలు విడుదలయ్యాయి. లీడ్ రోల్ ఆఫర్స్ కూడా ఆమెకు దక్కుతున్నాయి అని చెప్పొచ్చు. దర్జా మూవీలో అనసూయ సునీల్ తో పాటు ప్రధాన పాత్ర చేశారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ షూట్ చివరి దశకు చేరింది.

మరోవైపు సోషల్ మీడియాలో  అనసూయపై నెగిటివిటీ  బాగా ఎక్కువైంది. ఆమె అనవసర వివాదాల్లో తలదూర్చడమే దీనికి కారణం. లైగర్ మూవీపై నెగిటివ్ ట్వీట్ చేసిన అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది మరీ. ఆంటీ అంటూ వాళ్ళు అనసూయను ట్రోల్ చేశారు. ఈ వివాదం మూడు రోజులు ట్విట్టర్ ని షేక్ చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: