ప్రేక్షకులను వైవిధ్య భరితమైన సినిమా లతో అలరిస్తూ అగ్ర హీరోగా ఎదుగుతున్నాడు అడవి శేష్. ఇటీవల ఆయన మేజర్ అనే ఒక ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో చేసిన సినిమా తో భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు మరొక విభిన్నమైన సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కిందని చెప్పాలి. వాస్తవానికి అడవి శేష్ ఈ సినిమాలో నటించాల్సింది కాదు.

నాని నిర్మాణంలో రూపొందిన హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా లో విశ్వక్ హీరోగా నటించగా రెండో భాగానికి ఈ హీరోను ఎంచుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అడవి శేష్ నటించిన ఈ సినిమా యొక్క టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది బాగా ఉందని వారు చెబుతున్నారు. తప్పకుండా సస్పెన్స్ ను మెయింటైన్ చేయడంలో ఈ సినిమా సఫలం అవుతుంది అని కూడా వారు చెబుతున్నారు.

ఏదేమైనా అడవి శేష్ ఈ సినిమాతో మరొక విజయాన్ని అందుకుంటే మాత్రం తప్పకుండా ఈ హీరోకి మరింత క్రేజ్ తోడవడం ఖాయం అని చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతూ ఉండడం అభిమానులలో ఎంతో ఆసక్తి ని రేకెత్తిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నారని చిత్ర బృందం తెలియ జేసింది. ఆ విధంగా అడవి శేష్ ఏ స్థాయిలో ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. ఇటీవల హిట్ సినిమాను బాలీవుడ్ లో రూపొందించగా ఆ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులు భారీ స్థాయిలో విజయాన్ని అందజేశారు. ఈ సినిమాను కూడా అదే విధంగా విజయాన్ని అందుకునేలా చేస్తారా అనేది చూడాలి. శైలేంద్ర దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ సినిమాకు మంచి బడ్జెట్ తో నాని రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: