సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఈ మధ్యకాలంలో వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ సంవత్సరం మహేష్ బాబు "సర్కారు వారి పాట" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే ముగిసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఈ నెల చివరన ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: