నందమూరి
బాలకృష్ణ హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేసిన దర్శకుడు
అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాల
కృష్ణ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు
బాలయ్య తాను నటించిన వీర
సింహా రెడ్డి
సినిమా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబం ధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తు ఉండగా తప్పకుండా ఈ
సినిమా అఖండ చిత్రం లాగానే భారీ విజయాన్ని తెచ్చిపెడుతుంది అని నందమూరి
బాలకృష్ణ భావిస్తున్నాడు.
శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ సిని మా కు
తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తర్వాత నందమూరి బాల
కృష్ణ చేయబోయే
సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూశారు. అలా
అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే త్వరలోనే చేయబోతున్న నందమూరి
బాలకృష్ణ ఆ చిత్రా న్ని పాన్
ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. అందుకే ఈ
సినిమా కోసం ఒక
బాలీవుడ్ బ్యూటీని
హీరోయిన్ గా ఎంపిక చేయాలని ఆయన చెబుతున్నారట.
దానికి తగ్గట్లుగానే దర్శకుడు
అనిల్ రావిపూడి ఈ
సినిమా కోసం
సోనాక్షి సిన్హాను ఈ సినిమాలో
హీరోయిన్ గా ఎంపిక చేసే విధంగా రంగం సి ద్ధం చేస్తున్నారట. తొంద ర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.
కామెడీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఎంతగానో రూపొందించే
అనిల్ రావిపూడి ఈ సి నిమాను కూడా అదే విధంగా చేస్తున్నాడట. ఈ
సినిమా తర్వాత
ఆదిత్య 999 సినిమాలో నటించబోతున్నాడు నందమూరి
బాలకృష్ణ దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఓ
యువ దర్శకుడితో నే చేస్తాడని అంటున్నారు.