సూపర్ స్టార్ మహేష్ బాబు,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కు సంబంధించి షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా సినిమా స్క్రిప్ట్ విషయంలో పలు మార్పులు చేశారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కొన్ని నిజాలు ఉండగా మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర విషయంలో చిన్న చిన్న మార్పులు జరిగినట్లుగా త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి వార్తలు అనధికారికంగా బయటికి వినిపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలోని అత్యంత కీలకమైన ఒక పాత్రకి మలయాళం నటుడు తీసుకురావడం జరుగుతోందట. ఆ పాత్రకు ఈ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా స్క్రిప్ట్ మార్చిన తర్వాత ఆ పాత్ర యొక్క పరిధి కూడా చాలా తక్కువ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా యొక్క వివాదాలు సీరియస్ చర్చలు అన్నీ కూడా ముగిసినట్లే అని సమాచారం. ఇక ఈ నెల చివరిలో ఈ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ కాస్త రాజీ పడి మహేష్ బాబు సినిమా చేస్తున్నాడనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని మహేష్ బాబును అన్ని విషయాలకు ఒప్పించిన తర్వాతే త్రివిక్రమ్ ఈ సినిమాను మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా మళ్లీ పునః ప్రారంభానికి మహేష్ బాబు కూడా పూర్తి సంతృప్తితో ఉన్నారని త్రివిక్రమ్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్నది సెకండ్ హీరోయిన్ పాత్ర ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: