నందమూరి
బాలకృష్ణ ఎలాంటి సినిమాలను చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన
మాస్ ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తూ ఇప్పటిదాకా అగ్ర హీరోగా కొనసాగుతూ వచ్చారు. ఆ విధంగా
బాలకృష్ణ ఇప్పుడు మరొక
మాస్ మసాలా
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమాను విడుదలకు సిద్ధం చేశారు.
బాలకృష్ణ వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతూ ఉండగా పలు భారీ సినిమాలతో ఈ చిత్రం పోటీకి సిద్ధమయ్యింది.
బాలకృష్ణ వరుస
మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండగా ఇప్పుడు ఆయన తన రూటు మార్చారని తెలుస్తుంది. ఆయన తన తదుపరి
సినిమా చేసే భాగంలో
కామెడీ యాక్షన్ సినిమాలను చేసే దర్శకుడైన
అనిల్ రావిపూడి తో కలిసి తదుపరి
సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చింది. ఆయన మొదటి నుంచి చేస్తున్న సినిమాలను ఒకసారి గమనిస్తే ఇప్పుడు పరిశీలిస్తే ఎక్కువగా
కామెడీ యాక్షన్ భరితమైన సినిమాలో ఎక్కువగా ఉంటాయి. యాక్షన్ కంటే
కామెడీ ప్రధానంగా ఆయన సినిమాలు కొనసాగుతూ ఉంటాయి.
ఆ విధంగా
బాలకృష్ణ కూడా ఈ సినిమాను ఏరి కోరి మరి ఎంచుకోవడం విశేషం. ఇక ఈ
సినిమా తర్వాత కూడా ఆయన ఒక వెరైటీ
జోనర్ లో సినిమాను చేయాలనుకోవడం విశేషం. గతంలో
ఆదిత్య 369 వంటి వెరైటీ కథలున్న సినిమాలను చేసిన దర్శకుడు ఇప్పుడు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడట. మరి కొన్ని రోజులు ఆయన సినిమాలను
మాస్ ప్రేక్షకులు మిస్ అవ్వడం ఖాయం అనే చెప్పాలి. ఇక అయ న చేసిన వీర
సింహ రెడ్డి
సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ
సినిమా లో శ్రుతి హసన్
హీరోయిన్ గా నటిస్తుంటే
తమన్ సంగీతాన్ని సంగీతం సమకూరుస్తున్నాడు.