
అయితే సినిమా వీ ఎఫ్ ఎక్స్ షాట్లను సరి చేసే పనిలో చిత్ర ఇబృందం బిజీగా మారిపోయిందని టెక్నీషియన్లకు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉందని.. తెలిపిన ఓం రౌతు జూన్ కల్లా కంప్లీట్ చేస్తారని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై నమ్మకం లేని కొంతమంది 2024 కు సినిమాను వాయిదా వేస్తున్నారు అంటూ కొన్ని రూమర్స్ సృష్టించారు. దీంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ చెందారని చెప్పాలి. కానీ తాజాగా ఇదే విషయంపై చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జూన్ 16వ తేదీన వచ్చే ఏడాది ఆది పురుష్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నాము. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు.
ఈ చిత్రం కోసం ఇప్పటికే దాదాపు రూ.300 కోట్లను వెచ్చించినట్లు సమాచారం ..ఇప్పుడు మరో రూ.100 కోట్లతో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను సరి చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో సైఫ్ అలీ ఖాన్ గడ్డాన్ని మార్చడానికి వీ ఎఫ్ ఎక్స్ కోసం అదనంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.