మెగా స్టార్  వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి  మనకి పరిచయం అవసరం లేదు ,ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన rrr సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అని మనం చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు అంటా మరీ.ఇలా వరుస సినిమాల తో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు.

తాజా గా రామ్ చరణ్ ది ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డుకు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంపికయ్యారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో నే రామ్ చరణ్ ఈ అవార్డు ను అందుకోవడం తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ అవార్డు అందుకున్న అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలు  మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు అని చెప్పొచ్చు.

ఈ సందర్భం గా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నాన్న.. నిన్ను చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది.భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చిరంజీవి తన కుమారుడు అందుకున్న ప్రతిష్టాత్మకమైన అవార్డు పట్ల ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్  ఎప్పుడు బాగా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తు పోస్టులు  కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: