అనసూయకు టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ట్ తోనే ఢీ అన్న నటి అనసూయ. అర్జున్ రెడ్డి మూవీలో కొన్ని సీన్స్, బూతులపై అనసూయ అభ్యంతరం చెప్పారు.
న్యూస్ ఛానల్స్ డిబేట్స్ లో పాల్గొని వాదించారు. ఆ వివాదం అప్పుడు ముగియగా లైగర్ రిలీజ్ రోజు మళ్ళీ గెలికింది. లైగర్ కి ప్లాప్ టాక్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా 'అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడిందని'  చేసింది. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ 'మాదర్ చూ**' అంటూ తిడతాడు. ఆ బూతుల ఫలితమే లైగర్ ప్లాప్ అని ఆ చిత్ర ఫెయిల్యూర్ ని అనసూయ ఎంజాయ్ చేశారు.

అనసూయ   వివాదాస్పదమైంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వేధింపులపై అనసూయ కొందరిపై సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేశారు. ఇటీవల కూడా తనను ట్రోల్ చేసిన ఒక వ్యక్తిని కటకటాల వెనక్కి పంపించింది. అనసూయతో పాటు రష్మీ గౌతమ్, ప్రగతి, విష్ణుప్రియ, శ్రీముఖిలపై అసభ్యకర సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్న సదరు వ్యక్తి పై కంప్లైంట్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ లు జరుగుతున్నా అనసూయను ట్రోల్ చేయడం ఆగడం లేదు. అదే సమయంలో ఆమె కూడా తగ్గడం లేదు. ఈ మధ్య అనసూయ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపిస్తుంది. తన లగ్జరీ, హ్యాపీ లైఫ్ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తుంది. ఆమె వైభవం చూసి హేటర్స్ కుళ్ళు కోవాలని అనసూయ భావిస్తున్నారు. తాజాగా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకున్న ఫోటోలు షేర్ చేసింది. ఫైవ్ స్టార్ హోటల్ లో వైన్ తాగుతూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పంచుకున్నారు.

అనసూయ వైన్ గ్లాస్ తో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ఫోటోలు చూసిన కొందరు అనసూయకు ఆ వ్యసనం కూడా ఉందా! అని వాపోతున్నారు. హైక్లాస్ సొసైటీలో వైన్ తాగుతూ భోజనం చేయడం కల్చర్ గా భావిస్తారు. అది వ్యసనం కాదు. కాగా అనసూయ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. విరివిగా సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరను కూడా వదిలేసింది. అనసూయ తనకు ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. పుష్ప 2, రంగమార్తాండ చిత్రాలతో పాటు ఒకటి రెండు వెబ్ సిరీస్ లో అనసూయ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: