టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వాడే రేంజ్ లో సోషల్ మీడియా ని నేటితరం కుట్రకారులు కూడా వాడరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు ఆయనకి సంబంధించిన సినిమాల లేటెస్ట్ న్యూస్ ని కూడా ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉంటాడు .అయితే లేటెస్ట్ గా ఆయన సోషల్ మీడియా ఖాతా నుండి రామ్ చరణ్ ఉపాసన మొదటి సంతానంకి జన్మనివ్వబోతున్నారు అంటూ అధికారిక ప్రకటన చేశాడు. 

అయితే సుమారు 10 సంవత్సరాల నుండి ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఈ వార్త విని ఎంతో సంతోషిస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి చేసిన మరో పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది సాయంత్రం 6 గంటలకు అందరూ నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి రండి అంటూ చిరంజీవి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి ఇవ్వబోతున్న .సర్ప్రైజ్ ఏంటి...లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య కు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నాడా లేదా రామ్ చరణ్ ఉపాసనలకి

 సంబంధించిన ఏదైనా విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడా అని అయోమయంలో పడ్డారు మెగా అభిమానులు. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకి సంబంధించిన రెండవ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు అని ఇటీవల ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.  దానికి సంబంధించిన అప్డేట్ ని చిరంజీవి ఇస్తాడేమో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు .ఇదిలా ఉంటే మరో పక్క తల్లిదండ్రులు అవ్వబోతున్న రామ్ చరణ్ ఉపాసనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి పవన్ కళ్యాణ్... చిరంజీవి ఇంటికి వచ్చాడని ఆ సందర్భంగా తీసిన వీడియోని కుటుంబంతో ఆయన కలిసి గడిపిన ఆ మధుర క్షణాలను వీడియోగా తీసి విడుదల చేయబోతున్నారేమో అని ఆయన అభిమానులు కొంతమంది చెప్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే మరో ఆరు గంటలు రావాల్సిందే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: