ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలను బట్టి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి,  బాలయ్యలను కమలహాసన్ టార్గెట్ చేశారా?  అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఆరుపదుల వయసులో కూడా వీరు కూతురుతో సమానమైన అమ్మాయితో రొమాన్స్ చేయడం కమలహాసన్ జీర్ణించుకోలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా ఎంపిక అయింది.


 ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్నాయి.  అంతేకాదు ఈ రెండు సినిమాలను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సుమారుగా రూ.250 కోట్లు పెట్టి రెండు చిత్రాలను నిర్మించడం జరిగింది. ఇందులో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కి సిద్ధం కాగా.. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతోంది.ఇప్పటికే వీరిరువురు తమ సినిమా ప్రమోషన్స్ లను చేపట్టారు. ఈ క్రమంలోని కమలహాసన్ వీరిని టార్గెట్ చేస్తూ సెటైరికల్ పంచ్ వేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.


తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ మాట్లాడుతూ," సీనియర్ హీరోలు తమ వయస్సుకు తగ్గట్టు పాత్రలు పోషించాలని అలాగే  చిన్న పాత్రలు చేయడం మానుకోవాలని" అన్నారు. ఇక్కడ  హాస్యాస్పదమేమిటంటే, చిరుతో అతని కుమార్తె జంటగా  మరియు బాలయ్య తో జంట గా శృతిహాసన్ నటిస్తుండడంతో ప్రస్తుతం కమలహాసన్ చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి,  బాలయ్యలపై ట్రోల్ చేస్తున్నారు.  ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోయిన్ల సరసన నటిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. కూతురు వయసున్న అమ్మాయితో ఆడి పాడడం ఏంటి? అంటూ ఈమధ్య నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇకనైనా పద్ధతి మార్చుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: