టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ సినిమా అనంతరం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.ఇక ఆ సినిమాలో సమంత మరియు నాగచైతన్య జంటగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో దాని అనంతరం చాలా ఏళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. దాని అనంతరం ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 

విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఆ సమయంలోనే అధికంగా వర్కౌట్లు చేయడం వల్ల మయోసైటిస్ అనే వ్యాధి రావడం జరిగింది. ఇక ఈ వ్యాధి నుండి సమంతా త్వరగా కోలుకోవాలని ఆ వ్యాధికి సంబంధించిన చికిత్సను కూడా సమంత తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకుండా ఇంట్లోనే ఉంటుంది సమంత. అయితే తాజాగా ఎప్పుడూ సెలబ్రిటీలపై జాతకాలు చెప్పే వేణు స్వామి సమంత పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈయన చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెప్పాడు.

గతంలో ఈయన నాగచైతన్య సమంత పెళ్లయిన అనంతరం విడాకులు తీసుకుంటారు అని కూడా అప్పట్లో చెప్పాడు. ఇక ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్నారు.వీరితోపాటు అప్పట్లో నయనతార గురించి కూడా ఈయన మాట్లాడుతూ పెళ్లి అయిన అనంతరం అనేకమైన ఇబ్బందులను నయనతార ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు నయనతార కూడా అలాంటి ఇబ్బందులని ఎదుర్కొంటుంది. అయితే తాజాగా సమంత గురించి ఈయన మాట్లాడుతూ సమంతకి వచ్చిన ఈ వ్యాధి ప్రమాదకరం ఏమీ కాదు.. కానీ 2025 నాటికి సమంత అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక సమంత అనారోగ్యంపై ఈయన చేసిన కామెంట్లు కాస్త వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: