అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయకగా ప్రస్తుతం ఈమె సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల ఏమే మిలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది జాన్వీ. ప్రస్తుతం దక్షిణాది పై మనసు పారేసుకుంది ఈమె.అయితే జాన్వీ చాలా సందర్భాల్లో తనకి సౌత్ లో సినిమాలు చేయాలని ఉందని ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చాలా సందర్భాల్లో ఈమె చెప్పుకొచ్చింది.

అనంతరం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ ప్రాజెక్టులో జాన్విని హీరోయిన్గా అనుకుంటున్నట్లు చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.అయితే ఒకవేళ తను ఈ సినిమా లో హీరోయిన్గా నటిస్తుంది అంటే ఈ సినిమాతోనే తన టాలీవుడ్ సినీ ఎంట్రీ ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు జాన్వీ. ఇక ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరో హీరో అంటే కూడా తనకి చాలా ఇష్టమని చెప్పొచ్చింది ఈమె.  అందులో భాగంగా జాన్వి మాట్లాడుతూ ఎన్టీఆర్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని ఆయన నటనకు నేను వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది.

దాంతోపాటు ఇటీవల విడుదలైన కాంతార సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఈ సినిమా డైరెక్టర్ మరియు హీరో అయినా రిషబ్ శెట్టి  గురించి కూడా మాట్లాడుతూ  ఈ సినిమాతో నేను ఆయనకి  పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని వీరిద్దరి గురించి పొగుడుతూ మాట్లాడింది జాన్వి. దీని అనంతరం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోతో మీకు నటించాలని ఉంది అని అడగగా ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ తో నటించాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈమె. దీంతో ఈమె జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: