వారసుడు, పుష్ప 2 వంటి సౌత్ ఇండియన్ సినిమా లలో నటిస్తూ బిజీగా ఉన్నా కన్నడ బ్యూటీ రష్మిక దక్షిణాది సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.గడిచిన ఆరు నెలల నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ కన్నడ బ్యూటీ తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో ఇటీవల విమర్శలు ఎదుర్కొంది. ఇదిలో ఉండగా తాజాగా మరొకసారి వివాదంలో చిక్కుకుంది ఈ ముద్దుగుమ్మ. కొద్ది రోజులుగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈమె ఇటీవల దక్షిణాది చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీ అంశంగా మారాయి.

దక్షిణాది సినిమాలలో ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయని ఆమె చెప్పడంతో నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు.  తాజాగా రష్మిక,  సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి బాలీవుడ్లో మిషన్ మజ్ను చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఈ నేపథ్యంలో రష్మిక కొన్ని రోజుల నుంచి చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన  కార్యక్రమాలలో వేగంగా పాల్గొంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక పాట విడుదలవగా. ఆ పాటను దృష్టిలో పెట్టుకొని.. చిన్నప్పటినుంచి నా దృష్టిలో రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ సినీ పరిశ్రమే గుర్తుకొస్తుంది.  ఇక్కడ ఎన్నో రొమాంటిక్ పాటలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి.

ఇక్కడ చూసుకుంటే డాన్స్ తో కూడిన మాస్ మసాలా ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి . ఇది నా తొలి బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్.  ఈ పాట చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.  దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వగా.. చాలామంది ఈమెను టార్గెట్ చేస్తూ రకరకాలుగా వ్యాఖ్యలు వైరల్ చేస్తున్నారు. సౌత్ పరిశ్రమ నీకు జీవితాన్ని ప్రసాదించింది.. అలాంటి పరిశ్రమపై నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ మరికొంతమంది ఈమెపై ఫైర్ అవుతున్నారు. అయితే రష్మిక మాత్రం ఈరోజుల్లో సౌత్ పాటలు చాలా స్కిన్ షో మరియు హీరో ఆరాధనతో మాస్ నెంబర్ల గురించి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తన దృష్టిలో తప్పుగా అనిపించలేదని చెప్పింది.  కానీ కావాలనే ఆమెను ఉద్దేశపూర్వకంగా కొంతమంది టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: