నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... హనీ రోజి , వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్మూవీ లో ఇతర కీలక పాత్రలో నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున ఈ మూవీ ని థియేటర్ లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల అయిందో తెలుసుకుందాం.

సినిమా నైజాం ఏరియాలో 265 ప్లస్ థియేటర్ లలో విడుదల కాగా ... సీడెడ్ లో 200 ప్లస్ థియేటర్ లలో ... ఆంధ్ర లో 410 ప్లస్ థియేటర్ లలో విడుదల అయ్యింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 ప్లస్ థియేటర్ లలో ... ఓవర్సీస్ లో 500 ప్లస్ థియేటర్ లలో విడుదల అయింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1465 ప్లస్ థియేటర్ లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: