టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ చాలా రకాల రికార్డ్స్ నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతూనే ఉంది..ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకి కనెక్ట్ అయితే లాంగ్ రన్ ఏ రేంజ్ లో ఉంటుందో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా తరువాత 'వాల్తేరు వీరయ్య' సినిమా నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాని చాలా కాలం తర్వాత చెయ్యడం, దానికి తోడు మరో బిగ్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో ఉండడం వల్ల విడుదలకి ముందు నుండే ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉండేవి.ఇక ఆ అంచనాలను ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే అందుకుంది ఈ సినిమా..ఇక ఆ తర్వాత వారం రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల రూపాయిల షేర్ ని అందుకోవడం అలాగే పది రోజుల్లోపే 200 కోట్ల రూపాయిల గ్రాస్ కి దగ్గర అవ్వడం, అలా అన్నీ ఈజీగా జరిగిపోయాయి..


68 ఏళ్ళ వయస్సున్న ఒక సీనియర్ హీరో ఈ రేంజ్ రికార్డ్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు.ఇప్పటికి పెద్ద సిటీస్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే 250 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది ఇంకా షేర్ 138 కోట్ల రూపాయలకు చేరుకోబోతుంది. ఈ రికార్డ్ కూడా ఈ వారం లోనే జరుగుతుందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది..ఒక ప్రాంతీయ కమర్షియల్ సినిమాకి ఈ రేంజ్ లో వసూళ్లు రావడం అంటే అది మామూలు విషయం కాదు..ఆచార్య ఇంకా గాడ్ ఫాథర్ వంటి వరుస కమర్షియల్ ఫెయిల్యూర్స్ తర్వాత ఈ రేంజ్ లో కం బ్యాక్ మూవీ మెగాస్టార్ కి వస్తుందని ఊహించలేకపోయారు.కేవలం చిరంజీవికే కాదు.. మరో బిగ్ హీరో మాస్ మహారాజాకి కూడా ఈ సినిమా రికార్డ్స్ లో భాగం ఉంది. కాబట్టి ఈ సినిమా రికార్డ్స్ ఈ ఇద్దరి హీరోలకి సమానంగా చెందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: