తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల వారసులు ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసి కొంతమంది టాప్ పొజిషన్లో ఉన్నారు. హీరోలే కాదు డైరెక్టర్ల వారసులు సైతం ఎప్పటికి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక వీరిలో కొంతమంది సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు బాలయ్య వారసుడు ఎంట్రీ కోసం ఎంతో కాలం ఎదురు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ని అందుకోగా.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినీ రంగ ప్రవేశం చేయలేదు. 

దీంతో అభిమానులు ఈ విషయంలో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో బాగా వినిపిస్తోంది. అదేంటంటే 2024 ఎన్నికల అనంతరం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని సమాచారం. తన కొడుకు ఎంట్రీ విషయంలో బాలయ్య ఎక్కువగా జాతకాలను నమ్మి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని.. అందుకే అదే ఇప్పుడు ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోక్షజ్ఞ పేరు మీద జాతకం అంతగా బాగా లేకపోవడంతో ఇప్పుడే సినీ ఎంట్రీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారట. మోక్షజ్ఞ కి ఎలక్షన్స్ తర్వాత జాతకరీత్యా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని.. అందుకే అప్పుడు సినీ ఎంట్రీ పెట్టుకుంటే బాగుంటుందని

 బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అటు డైరెక్టర్ విషయంలో కూడా బాలయ్య ఎంతో క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో ఓ సినిమాని, అలాగే  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఓ సినిమాని ప్లాన్ చేశారట. ఇలా ఒకేసారి ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టి తన కొడుకుతో సినిమాలు చేయాలని బాలయ్య ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్వరలోనే బాలయ్య ఈ విషయంపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇటీవల 'వీరసింహారెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య తన తదుపరిచిత్రాన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ కథానాయకగా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: